: తనకన్నా తొమ్మిదేళ్లు పెద్దదయిన హీరోయిన్ తో ధనుష్ రొమాన్స్!

దక్షిణాది హీరో ధనుష్ తనకన్నా 9 సంవత్సరాలు పెద్దయిన బాలీవుడ్ హీరోయిన్ తో జతకట్టనున్నాడు. తెలుగులో 'రఘువరన్ బీటెక్'గా వచ్చిన తమిళ చిత్రం 'వేళ ఇల్లే పట్టదారి'కి సీక్వెల్ గా 'వీఐపీ-2' తీస్తుండగా, ఈ చిత్రంలో బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ కాజల్ హీరోయిన్ గా నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాజల్ వయసు 42 దాటగా, ధనుష్ కు 33 మాత్రమే. రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య డైరెక్షన్ లో ఈ చిత్రం రూపొందనుండగా, కాజోల్ ను హీరోయిన్ గా ఒప్పించేందుకు ధనుష్, సౌందర్యలు ప్రయత్నించారని, ఆమె డేట్స్ కోసం షూటింగ్ ను నెల రోజులు వాయిదా వేసినట్టు సమాచారం. కాజోల్ ఈ చిత్రంలో నటిస్తే, దాదాపు 20 సంవత్సరాల తరువాత, అంటే, 1997లో 'మెరుపుకలలు' తరువాత ఆమె నటించే మరో దక్షిణాది చిత్రం ఇదే కానుంది.

More Telugu News