: నోట్ల రద్దును విమర్శించే వాళ్లు యాభై రోజులపాటు ఓపికగా ఉండాలి: రాజ్ నాథ్ సింగ్

పెద్దనోట్ల రద్దును విమర్శిస్తున్న వాళ్లు యాభై రోజుల పాటు ఓపికతో వ్యవహరించాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. లక్నోలో రైల్వే ప్రాజెక్టు పనులకు శంకుస్థాపనలు చేసేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, యాభై రోజుల పాటు ప్రజలు ఇబ్బంది పడక తప్పదని, ఆ తర్వాత సాధారణ పరిస్థితులు వస్తాయని పెద్దనోట్ల రద్దు నాడే మోదీ చెప్పారని అన్నారు. జాతి ప్రయోజనాల కోసం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ద్వారా ధనిక, పేదల మధ్య అంతరం లేకుండా పోతుందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలు కట్టుబడి ఉన్నారని, దేశం కోసం ఏం చేయడానికైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

More Telugu News