: అక్రమ లావాదేవీలకు పాల్పడ్డ 27 మంది బ్యాంక్ అధికారులపై సస్పెన్షన్ వేటు!

పెద్దనోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా అక్రమ లావాదేవీలకు పాల్పడ్డ బ్యాంక్ అధికారులపై వేటు పడింది. 27 మంది ప్రభుత్వ బ్యాంకుల అధికారులను సస్పెండ్ చేయగా, మరో ఆరుగురు అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఒక ప్రకటన చేశారు. కాగా, పెద్దనోట్ల రద్దు అనంతరం ఆయా నోట్లను మార్పిడి చేసుకునేందుకు, చిన్న నోట్లు తీసుకునే నిమిత్తం బ్యాంకులకు వెళ్లిన ఖాతాదారులు పలు ఫిర్యాదులు చేస్తున్నారు. చిన్న నోట్లు ఇచ్చే విషయంలో బ్యాంకు అధికారులు సక్రమంగా వ్యవహరించడం లేదని, తమ సన్నిహితులకు, బడా బాబులకు దొడ్డిదోవన డబ్బు తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటం విదితమే.

More Telugu News