: మార్కెట్‌ లోకి కొత్త రూ.500 నోట్లు తీసుకొచ్చాం.. పరిస్థితి అదుపులోకి వస్తుంది: శక్తికాంత దాస్

చిల్లర దొరక్క ప్రజలు పడుతున్న కష్టాలను అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, మార్కెట్‌ లోకి మరిన్ని కొత్త రూ.500 నోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. రూ.500 నోట్లను మరింత సర్క్యులేషన్ లోకి తీసుకొస్తామని చెప్పారు. త్వరలోనే నగదు కొరత తీరుతుందని వ్యాఖ్యానించారు. పెద్దనోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను గమనిస్తున్నామని, క్యాష్‌ రిజర్వు రేషియో (సీఆర్‌ఆర్‌)పై భారతీయ రిజర్వు బ్యాంకు ఈ నెల 9న సమీక్షిస్తుందని తెలిపారు. అందులో అధికారులు తీసుకునే నిర్ణయం కోసం తాము ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అధికంగా ఉన్న లిక్విడిటీని ఆర్బీఐ నిర్వహిస్తుందని పేర్కొన్నారు.

More Telugu News