: తన తండ్రి బైక్ పై ఎంతో ఠీవీగా కూర్చున్న ధోనీ కూతురు !

ధోనీ కూతురు జీవా తన తండ్రి బైకుపై ఎక్కి కూర్చుని ఠీవీ ఒలకబోసింది. కాన్ఫెడరేట్ హెల్ కాట్ బైకుపై జీవా కూర్చున్న ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఒక ఫొటో షూట్ లో భాగంగా శిప్రా, అమిత్ చాబ్రా ఈ ఫొటో తీశారు. ఈ బైక్ పై కూర్చున్న కూతురు ఫొటోను తల్లి సాక్షి తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. నవ్వులు చిందిస్తూ బైక్ పై కూర్చున్న జీవా ఫొటోను నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు. కాగా, బైక్ లంటే మోజుపడే ధోనీ వద్ద ఇప్పటికే సాధారణ బైక్ ల నుంచి స్పోర్ట్స్ బైక్ ల వరకు చాలా ఉన్నాయి.

More Telugu News