: మకావు ఓపెన్‌ గ్రాండ్‌ప్రిలో నిరాశపరిచిన సైనా నెహ్వాల్

భార‌త బ్యాడ్మింట‌న్‌ స్టార్‌, హైద‌రాబాదీ సైనా నెహ్వాల్ మకావు ఓపెన్‌ గ్రాండ్‌ప్రిలో అద్భుతంగా రాణించి నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా ష‌ట్ల‌ర్ అయ‌స్తిన్‌పై విజ‌యం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రోజు జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో ఆమె భార‌త అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. చైనా క్రీడాకారిణి జాంగ్ యిమాన్ తో పోరాడిన సైనా నెహ్వాల్ ఓట‌మిని చవిచూసింది. మ్యాచులో 21-12, 21-17 తేడాతో ప‌రాజ‌యం పాలై టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది.

More Telugu News