: ఇక అన్నింటికీ ఆధారే ఆధారం.. అన్ని లావాదేవీలు ఇక నుంచి దాని ద్వారానే.. రంగం సిద్ధం చేస్తున్న ప్ర‌భుత్వం

పెద్ద‌నోట్ల రద్దుతో క్యాష్ లెస్ ప్ర‌చారాన్ని ప్రారంభించిన ప్ర‌భుత్వం మున్ముందు కార్డ్‌లెస్ లావాదేవీల‌కు రంగం సిద్ధం చేస్తోంది. క్రెడిట్‌, డెబిట్ వంటి కార్డుల‌తో ప‌నిలేకుండా ఒక్క ఆధార్ నంబ‌రుతోనే మొత్తం లావాదేవీలు నిర్వ‌హించేలా ఓ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ నెట్‌వ‌ర్క్‌ను అభివృద్ధి చేస్తోంది. అదే క‌నుక అందుబాటులోకి వ‌స్తే నగ‌దు ర‌హిత‌మే కాదు.. కార్డ్‌లెస్ దేశంగా భార‌త్ ఉద్భ‌విస్తుంది. లావాదేవీల కోసం ఆధార్ నంబ‌రు చెప్పి వేలిముద్ర‌ను ఫోన్ తో స్కాన్ చేయ‌డం ద్వారా మ‌న ఖాతాలోని సొమ్మును వేరొక‌రి ఖాతాలోకి బ‌ద‌లాయించ‌వ‌చ్చు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. ఇక నుంచి దేశంలో ఉత్ప‌త్తి అయ్యే ఫోన్లు అన్నింటిలో ఫింగ‌ర్ ప్రింట్, ఐరిస్ స్కాన‌ర్లు త‌ప్ప‌కుండా ఉండేలా చూడాల‌ని మొబైల్ తయారీదారుల‌ను కోరిన‌ట్టు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తెలిపారు.

More Telugu News