: మోదీ మారువేషంలో వెళ్లి రూ.2 వేలకు చిల్లర తేవాలి... ఒక ఖాతాదారుడి ఆవేదన

కొత్త నోటు రెండు వేల రూపాయలకు చిల్లర దొరకడం లేదని, బ్యాంకుల్లో సరిపడా నగదు ఇవ్వట్లేదంటూ హైదరాబాద్ లోని ఒక బ్యాంకులో ఒక ఖాతాదారుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక న్యూస్ ఛానెల్ తో సదరు ఖాతాదారుడు మాట్లాడుతూ, మోదీ ప్రధాని హోదా లో మారువేషంలో ఒక సామాన్యుడిగా హోటల్ కు వెళ్లి ఇడ్లీ తిని, చాయ్ తాగిన తర్వాత, బిల్లు చెల్లించేందుకు రెండు వేల రూపాయల నోటు ఇస్తే..చిల్లర ఇస్తారో లేదో చెప్పాలంటూ సదరు ఖాతా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి పూర్వం రాజులు మారు వేషాల్లో వెళ్లినట్లే, ఇప్పుడు మోదీ కూడా బయటకు వెళ్లి ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవాలని కోరారు. బ్యాంక్ క్యూలో ఉదయం నుంచి కొన్ని గంటలపాటు నిలబడితే తనకు ఐదువేల రూపాయలు మాత్రమే ఇచ్చారని, మరికొంత మంది ఖాతాదారులకు ఆమాత్రం కూడా దక్కలేదని సదరు ఖాతాదారుడు పేర్కొన్నాడు.

More Telugu News