: సీఎం చంద్రబాబుకు కృతఙ్ఞతలు తెలిపిన సచివాలయ ఉద్యోగులు

ఏపీ సచివాలయం ఉద్యోగులు తమ జీతాల్లో రూ.10 వేల చొప్పున నగదును బ్యాంకు నుంచి అందుకున్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్ నుంచి ఈ మొత్తాన్ని వారు అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు సచివాలయ ఉద్యోగులు తమ కృతఙ్ఞతలు తెలిపారు. కాగా, పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల్లో నగదు, చిల్లర సమస్యతో ప్రజలు సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులకు తమ జీతాల్లో రూ.10 వేల చొప్పున నగదు అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులకు తమ జీతాల్లో రూ.10 వేల చొప్పున నగదు అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

More Telugu News