: రహీల్ షరీఫ్ రిటైర్ కావడంతో అతని అభిమాని ఆత్మహత్య
పాకిస్థాన్ సైన్యాధిపతి పదవి నుంచి రహీల్ షరీఫ్ నవంబర్ 29న రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ బాధతో ఆయన అభిమాని అయిన అమీమ్ షిబ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల రోజులుగా కరాచీ ప్రెస్ క్లబ్ వద్ద 'డోన్ట్ గో జనరల్ రహీల్ షరీఫ్' పేరుతో ఆయన నిరాహారదీక్ష చేస్తున్నాడు. ఎంతగా డిమాండ్ చేస్తున్నా, రహీల్ షరీఫ్ పదవీ విరమణ పొందడంతో... విషం తాగి షబ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా అతని కుమారుడు అమీమ్ మాట్లాడుతూ, రహీల్ కి తన తండ్రి వీరాభిమాని అని చెప్పాడు. రహీల్ తమ పాలిట దైవదూత అని... పాకిస్థాన్ ను ఉగ్రవాదుల నుంచి కేవలం రహీల్ మాత్రమే కాపాడగలడని తన తండ్రి చెప్పేవాడని తెలిపాడు. కరాచీ పోర్ట్ ట్రస్ట్ వద్ద ప్రోగ్రెసివ్ వర్కర్స్ యూనియన్ కి ఛైర్మన్ గా అతని కుమారుడు అమీమ్ వ్యవహరిస్తున్నాడు.