: ఏపీలో ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. జీతం నుంచి పది వేలు క్యాష్ ఇస్తారట!

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశం మొత్తాన్ని నగదు కష్టాలు పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో చేతిలో ఐదు లేదా పది వేల రూపాయలు ఉంటే పండగే. ఏటీఎం, బ్యాంకు క్యూలలో నిల్చోలేక సాధారణ పౌరులు చేతులెత్తేస్తున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ప్రభుత్వోద్యోగి, పెన్షనర్ కు వారి వారి జీతం నుంచి పది వేల రూపాయల నగదు చేతికి ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు బ్యాంకర్లతో జరిపిన సమావేశంలో బ్యాంకు అధికారులు ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించారు. దీంతో సచివాలయం, బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ప్రతి ప్రభుత్వోద్యోగి, పెన్షనర్ చేతికి పదివేల రూపాయల నగదు అందజేస్తారు.

More Telugu News