: అయ్యప్పమాల ధరించాడంటూ విద్యార్థిని పాఠశాలలోకి రానీయలేదు!

అయ్యప్పమాల ధరించిన ఒక విద్యార్థిని పాఠశాలకు రావద్దంటూ యాజమాన్యం ఆదేశించిన సంఘటనపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. హైదరాబాద్ ఈసీఐఎల్ లో ఉన్న కాల్ పబ్లిక్ స్కూల్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి అయ్యప్పమాలలో ఉన్నాడు. ఈ మాల ధరించాడనే కారణంగా పాఠశాల యాజమాన్యం ఆ బాలుడిని ఇంటికి పంపివేసింది. జరిగిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ పాఠశాలకు వెళ్లి ఈ విషయమై యాజమాన్యాన్ని ప్రశ్నించగా, వారు సరైన సమాధానం చెప్పలేదు. అయ్యప్పమాల వేస్తే పాఠశాలలోకి రానివ్వరా? అంటూ సదరు విద్యార్థి తల్లిదండ్రులు, అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములతో కలిసి పాఠశాల ముందు ధర్నాకు దిగారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

More Telugu News