: ‘పేటీఎం’ కాదు ‘పేపీఎం’ అంటున్నారు: మమతా బెనర్జీ

పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడిన నాటి నుంచి ప్రధాన మోదీపై నిప్పులు చెరుగుతున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోమారు ఆగ్రహించారు. పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, బిగ్ బజార్ బిగ్ బాస్ గా ప్రధాని మోదీ మారిపోయారని మండిపడ్డారు. చివరకు చిన్నపిల్లలు సైతం మోదీని విమర్శిస్తున్నారని.. ‘పేటీఎం’ అనకుండా ‘పేపీఎం’ అంటున్నారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీ కన్నా దారుణంగా ఉన్నాయని అన్నారు.

More Telugu News