: డబ్బు ట్రాన్స్ ఫర్ చేయమంటూ జడేజాను కోరిన సెహ్వాగ్

ఈ మధ్య కాలంలో టీమిండియా మాజీ క్రికెటర్, డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ సెహ్వాగ్ ట్విట్టర్లో చేస్తున్న సందడి అంతాఇంతా కాదు. ఈ సారి జడేజాను ఉద్దేశించి సెహ్వాగ్ సరదాగా ఓ ట్వీట్ చేశాడు. 'వాహ్ జడ్డూ భాయ్... 2000 నోట్లకు చిల్లర దొరక్క మేము బాధ పడుతుంటే... నీవు మాత్రం ఏకంగా లక్ష రూపాయలను పేటీఎం అకౌంట్ లో వేసుకున్నావ్. అందులో నుంచి కొంచెం నాకు ట్రాన్స్ ఫర్ చేయి ప్లీజ్', అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. మొహాలీలో ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో బ్యాట్, బాల్ రెండింటితో రాణించిన జడేజా... ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఈ అవార్డు కింద లక్ష రూపాయల పేటీఎం క్యాష్ ప్రైజ్ దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే, సెహ్వాగ్ సరదాగా ట్వీట్ చేశాడు.

More Telugu News