: బంధువుల ఇంట్లో బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డికి తీవ్ర పరాభవం... చెంప చెళ్లుమనిపించిన క్రషర్ యజమాని

బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డికి తన బంధువుల ఇంట్లో ఘోర పరాభవం ఎదురైంది. జంగారెడ్డి సోదరుడికి, ఓ క్రషర్ యజమానికి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉండగా, వారిద్దరి మధ్యా చర్చ జరుగుతున్న వేళ, మధ్యలో వెళ్లిన జంగారెడ్డిపై దాడి జరిగింది. ఆయనపై దాడి చేసి, ఆ వీడియో రికార్డు చేయాలన్న ఉద్దేశంతో ముందే సీసీ కెమెరాలు అమర్చినట్టు తెలుస్తోంది. క్రషర్ యజమాని ఇంట రాజీ ప్రయత్నాలు జరుగుతుండగా, మధ్యలో వెళ్లిన జంగారెడ్డిని కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ అయి, వైరల్ అవుతోంది. ఈ వీడియోలో "నీ కాళ్లకు మొక్కుతా, తప్పయింది సార్" అని జంగారెడ్డి అనడం కనిపిస్తోంది. జంగారెడ్డి చివరికి చంపలేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్రషర్ యజమానికి, జంగారెడ్డి సోదరుడికి మధ్య రూ. 6 లక్షల నగదు విషయమై గొడవ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, అంతకుముందు ఇదే విషయంలో జంగారెడ్డి, సదరు యజమానిని కొట్టించాడని, అందుకు ప్రతిగానే ఈ దాడి జరిగిందని సోషల్ మీడియాలో గుప్పుమంటోంది.

More Telugu News