: సూర్యాపేట‌లో కార్డ‌న్‌సెర్చ్‌.. పోలీసుల అదుపులో అనుమానితులు

సూర్యాపేట‌లోని ఇందిర‌మ్మ కాల‌నీలో పోలీసులు నిర్వ‌హించిన కార్డ‌న్‌సెర్చ్‌లో ప‌లువురు అనుమానితులు ప‌ట్టుబ‌డ్డారు. దాదాపు 120 మంది పోలీసులు కార్డ‌న్‌సెర్చ్‌లో పాల్గొన్నారు. కాల‌నీలోని ప్ర‌తి ఇంటినీ తనిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా 70 బైకులు, 14 ఆటోలు, రెండు గ్యాస్ సిలిండ‌ర్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ప‌లువురు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. మున్ముందు కూడా కార్డ‌న్‌సెర్చ్‌లు కొన‌సాగుతాయ‌ని పోలీసులు తెలిపారు.

More Telugu News