: బ్యాంకు సిబ్బంది పొరపాటుతో.. ఒక్క రోజుకి బిలియనీర్ అయిన ఆటోడ్రైవర్!

బ్యాంకు అధికారులు చేసిన పొరపాటు ఆటోడ్రైవర్ ను బిలియనీర్ ను చేసింది. పంజాబ్ లోని అమృతసర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...అమృతసర్ కు చెందిన బల్వీందర్ సింగ్ అనే ఆటో డ్రైవరు స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా బ్రాంచ్ లో మూడు వేల రూపాయలతో ప్రధాని జన్ ధన్ యోజన ఖాతాను తెరిచాడు. ఆయన ఖాతాలో ఆ మొత్తమే ఉంది. అయితే, నవంబరు 4వ తేదీన తన ఖాతాలోకి 9,806 కోట్ల రూపాయలు జమ అయ్యాయని తెలుసుకొన్న బల్వీందర్ సింగ్ షాక్ అయ్యాడు. ఆ రోజు బ్యాంకు నుంచి 200 తీసుకుందామని బ్యాంకు వెళ్లిన బల్వీందర్, తనకు కావాల్సిన మొత్తం తీసుకుని బ్యాంకు క్యాషియర్ కు ఖాతా పుస్తకం అందించాడు. అతని ఖాతాలో వున్న రూ. 2,800 మొత్తాన్ని అతని పాస్ బుక్ లో ఎంటర్ చేయాల్సిన బ్యాంకు సిబ్బంది, పొరపాటున అతని అకౌంట్ నెంబర్ ను క్రెడిట్ కాలంలో ఎంటర్ చేశారు. దీంతో అతని అకౌంట్లో ఒక్కసారి 9,806 కోట్ల రూపాయలు వచ్చి చేరాయి. అనంతరం చేసిన తప్పు తెలుసుకుని షాక్ కు గురైన సిబ్బంది జరిగిన పొరపాటు గురించి కనీసం అతనికి సమాచారం కూడా అందించకుండా పొరపాటును సరిదిద్దుకున్నారు. దీంతో బల్వీందర్ సింగ్ ఏక్ దిన్ కా సుల్తాన్ గా మారాడు.

More Telugu News