: ఇంకా వారితోనే వెళితే నితీశ్ రాజకీయ జీవితం సమాధి కావడం ఖాయం: సుశీల్ మోదీ

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తున్న బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పునరాలోచించుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. ఇకపై కూడా వారితో కలిసి పనిచేస్తే నితీశ్ రాజకీయ జీవితం సమాధి కావడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి పనిచేసినంతకాలం నితీశ్ రాజకీయ జీవితం మరింత ఉన్నత స్థితికి చేరిందన్నారు.

More Telugu News