: ల్యాండ్ అవుతున్న విమానం నుంచి దూకేసిన మహిళ

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా ఓ మహిళ కిందకు దూకేసింది. అమెరికాలోని న్యూ ఆర్లియన్స్ నుంచి హ్యూస్టన్ కు వెళుతున్న విమానం బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్ పోర్ట్ రన్ వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ ద్వారం తెరిచి, 15 అడుగుల ఎత్తు నుంచి ఆమె దూకేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఘటనలో ఆ మహిళతో పాటు, ఎవరికీ ఏ అపాయం జరగలేదు. జరిగిన ఘటనతో తాము షాక్ కు గుయ్యామని తోటి ప్రయాణికులు చెప్పారు. కిందకు దూకిన మహిళ విమాన సిబ్బందితో కాని, తోటి ప్రయాణికులతో కాని ఏమీ మాట్లాడలేదని... ఎమర్జెన్సీ ద్వారం ఓపెన్ చేసి, దూకేసిందని తెలిపారు.

More Telugu News