: మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి టోర్నీకి సింధు దూరం

తనకు ఎంతో పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చిన మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి పీవీ సింధు వైదొలగింది. గత మూడేళ్లగా మకావు టోర్నీలో సింధు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో, టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా సింధు బరిలోకి దిగాల్సి ఉంది. అయితే, వచ్చే నెలలో జరగనున్న దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీకి సన్నద్ధం కావడానికే సింధు ఈ నిర్ణయం తీసుకుందని ఆమె తండ్రి రమణ తెలిపారు. మకావు టోర్నీ నుంచి చివరి నిమిషంలో సింధు వైదొలగడంతో, భారత్ కు సైనా నెహ్వాల్ సారధ్యం వహించనుంది.

More Telugu News