: మోదీ సంచలన నిర్ణయం... బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బ్యాంకు ఖాతాల వివరాలు అందించాలంటూ ఆదేశం

నల్లధనంపై ఉక్కుపాదం మోపుతున్న ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా తమ బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించాలని ఆయన ఆదేశించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన నవంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు జరిగిన తమ బ్యాంకు లావాదేవీలను జనవరి 1వ తేదీన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. మోదీ తాజా నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది.

More Telugu News