: ఫిలింనగర్ దైవసన్నిధానంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్ర బృందం

హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవసన్నిధానంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్ర బృందం మహా రుద్రాభిషేకం చేసింది. దీనికి ఈ చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, చిత్ర బృందం హాజరయ్యారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని, అమరావతి కీర్తి విశ్యవ్యాపితం కావాలని కోరుతూ మహా రుద్రాభిషేకం నిర్వహించినట్లు చిత్ర బృందం చెప్పింది. కాగా, ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుతూ బాలకృష్ణ అభిమానులు దేశ వ్యాప్తంగా ఉన్న 116 శివాలయాల్లో మహా రుద్రాభిషేకాలను నిర్వహిస్తున్నారు.

More Telugu News