: కేజ్రీవాల్ చాలా మంచి వ్యక్తి, 99 శాతం అంశాల్లో ఆయనే కరెక్ట్: లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కీలక వ్యాఖ్య

ఎప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలతో ఉప్పూ నిప్పులా ఉండే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ల మధ్య ఇదో కొత్తకోణం. అరవింద్ కేజ్రీవాల్ చాలా మంచి వ్యక్తని, అతనితో తనకు మంచి సంబంధాలున్నాయని నజీబ్ జంగ్ వ్యాఖ్యానించారు. రెండవ ఎడిషన్ 'టైమ్స్ లిట్ ఫెస్ట్' ను ప్రారంభించిన ఆయన 'ఇండియా ఎట్ 70: చేంజస్ బిగిన్ హేర్' అంశంపై ఆయన ప్రసంగించారు. "కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచి నాకు వచ్చే 99 శాతం అంశాలను ఏకీభవిస్తూనే ఉంటాను. కేవలం ఒక్క శాతం కేసుల్లో మాత్రమే ప్రభుత్వ నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తా" అని అన్నారు. చాలా అంశాల్లో కేజ్రీవాల్ సరైన నిర్ణయాలు తీసుకుంటుంటారని పొగిడారు. ఢిల్లీలో గత 25 సంవత్సరాలుగా పాలనలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో అంచనాలున్నాయని, వాటిని వీలైనంత త్వరగా అందుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని, ఈ కారణంగానే కొన్ని సమస్యలు వస్తున్నాయని జంగ్ వ్యాఖ్యానించారు.

More Telugu News