: కాలి చెప్పు కుట్టించుకుని 100 రూపాయలు ఇచ్చిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ

కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇషా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె కేరళ వెళ్లారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో విమానం దిగుతుండగా ఆమె కాలి చెప్పులు తెగిపోయాయి. దీంతో ఆమె చెప్పులు కుట్టే వ్యక్తికోసం చూస్తుండగా, పెరూరులో రోడ్డు పక్కన చెప్పులు కుట్టే వ్యక్తి కనిపించారు. దీంతో కారు ఆపిన ఆమె అతని వద్దకు వెళ్లి చెప్పులు కుట్టించుకున్నారు. ఆయన చెప్పులు కుట్టినంతసేపు ఆమె అతని పక్కనే స్టూలుపై కూర్చున్నారు. చెప్పులు కుట్టడం పూర్తయిన తరువాత ఎంతైందని ఆమె అతనిని అడిగారు. పది రూపాయలని ఆయన చెప్పడంతో అతని చేతిలో 100 రూపాయలు పెట్టారు. ఇది సోషల్ మీడియాలో ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె నిరాడంబరమైన వ్యక్తి అని అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

More Telugu News