: 'మీలాంటి వాళ్లు ఇక‌ మా ప‌క్క‌న కూర్చోకూడ‌దు' అంటూ అమెరికాలో భారత సంతతి వ్య‌క్తిపై దాడి

అమెరికాలోని ఓ బార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెన్సిల్వేనియాకి చెందిన భార‌త సంత‌తి వ్య‌క్తి అంకుర్‌ మెహతా రెడ్‌ రాబిన్‌పై ఓ వ్య‌క్తి దాడి చేశాడు. రెస్టారెంట్‌లోని బార్‌లో కూర్చొని ఉన్న అంకుర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన జెఫ్రీ బర్గెస్‌(54) అనే వ్య‌క్తి అంకుర్‌ని ఓ ముస్లిం అనుకొని పిడిగుద్దుల‌తో విరుచుకుప‌డ్డాడు. 'ఇక‌ పరిస్థితి మారిందని, మీలాంటి వాళ్లు మా పక్కన కూర్చోవటం నాకు ఇష్టం లేద‌'ని వ్యాఖ్య‌లు చేస్తూ అంకుర్ కూర్చున్న కుర్చీని లాగిపడేశాడు బ‌ర్గెస్. అంకుర్‌ ముఖంపై, తలపై పిడిగుద్దులు కురిపిస్తూ దాడిచేశాడు. ఈ దాడిలో అంకుర్‌కి గాయాల‌య్యాయి. అత‌డి పన్ను ఊడ‌డంతో పాటు పెదవి చిట్లి రక్తం కారిపోయింది. స‌మాచారం అందుకొని అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు అంకుర్‌ని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. ఈ దాడి జ‌రిపిన స‌మ‌యంలో బ‌ర్గిస్ మ‌ద్యం సేవించి ఉన్నాడ‌ని చెప్పారు. ఈ దాడిపై కౌన్సిల్ ఆఫ్ అమెరికా ఇస్టామిక్ రిలేష‌న్స్ స్పందిస్తూ ఆ దేశ అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన త‌రువాత ముస్లింల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొంది.

More Telugu News