: అక్రమ సంబంధాన్ని క్రూరత్వం అనలేం: సుప్రీంకోర్టు కీలక రూలింగ్

భర్త మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని భార్య దృష్టిలో క్రూరత్వం అని ప్రతిసారీ అనలేమని, ఈ విషయంలో కేసుల వారీగా నిజానిజాలను నిర్ధరించాల్సి వుంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కర్ణాటకలో ఓ కోర్టు నాలుగేళ్ల శిక్ష విధించిన కేసులో, నిందితుడి పిటిషన్ మేరకు విచారణ జరిపిన జస్టిస్ దీపక్ మిశ్రా, అమితవ రాయ్ లతో కూడిన ధర్మాసనం, శిక్ష నుంచి నిందితుడిని విముక్తం చేసింది. ఈ కేసులో భర్త వివాహేతర బంధంతో మనస్తాపం చెంది భార్య ఆత్మహత్య చేసుకోగా, తనపై వచ్చిన ఆరోపణలతో అతనితో బంధం నడిపిన మహిళ కూడా బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. దీంతో ఆమె తల్లి, సోదరుడు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ కేసు విచారణకు రాగా, దిగువ కోర్టు నిందితునికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా, కర్ణాటక హైకోర్టు దాన్ని ఖరారు చేసింది. ఈ కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు నమోదైన సెక్షన్ చెల్లదని అభిప్రాయపడ్డ సుప్రీం ధర్మాసనం, అతన్ని విడుదల చేసింది.

More Telugu News