: దారి మళ్లించి కల్తీకారం తరలిస్తోన్న కేటుగాళ్లు.. రెండు లారీల సరుకును స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ల్తీ కారం వ్యాపారం అల‌జ‌డి సృష్టిస్తోంది. అధికారులు ఇటీవ‌లే గుంటూరులో విస్తృతంగా త‌నిఖీలు జ‌రిపి భారీగా కల్తీ కారాన్ని ప‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ రోజు కృష్ణా జిల్లాలోనూ కల్తీ కారం తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని గంపలగూడెం మండలం పెనుగొలను ర‌హ‌దారి గుండా ఈ లారీలు వెళుతుండ‌గా సోదాలు నిర్వ‌హించిన పోలీసులు పట్టుకున్నారు. ఈ క‌ల్తీ కారాన్ని ఖమ్మం జిల్లా మధిర నుంచి అశ్వారావుపేటకు తీసుకెళుతుండ‌గా ప‌ట్టుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కంట‌ప‌డ‌కుండా గంపలగూడెం మీదుగా వ్యాపారులు కల్తీ కారాన్ని త‌ర‌లిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ పోలీసులు మాటువేసి పట్టుకున్నారు.

More Telugu News