: ప్రతిపక్షాలకు దీటుగా బదులిచ్చేందుకే... నేడు పార్లమెంట్ కు రానున్న ప్రధాని!

పాత నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తూ, పార్లమెంటులో గందరగోళం సృష్టిస్తున్న విపక్షాలకు దీటుగా బదులిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాజ్యసభకు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ప్రధాని సమాధానం ఇవ్వాలని శీతాకాల సమావేశాలు ఆరంభమైన రోజు నుంచి విపక్షాలు అటు లోక్ సభ, ఇటు రాజ్యసభల్లో రభస చేస్తూ, సాధారణ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ను సజావుగా సాగనివ్వాలని, చర్చకు తాము సిద్ధమని పాలక ఎన్డీయే విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్షాలు వినలేదు. ఇదే సమయంలో నరేంద్ర మోదీ యాప్ ద్వారా 90 శాతానికి పైగా ప్రజలు, ప్రధాని వెంటే ఉన్నట్టు తేలడంతో, పార్లమెంటుకు వచ్చి విపక్షాలకు సరైన సమాధానం చెప్పాలని మోదీ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

More Telugu News