: కోర్టుకు హాజరైన దత్తాత్రేయ, కేటీఆర్, నాయిని, కోదండరామ్

తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజుల్లో రైల్వేలను అడ్డుకోవడం, రైల్వే ఆస్తుల విధ్వంసం తదితర ఆరోపణలపై నమోదైన కేసుల్లో విచారణ నేడు జరిగింది. ఈ విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పలువురు రాజకీయ ప్రముఖులు సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ లతోపాటు ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, పద్మారావు, ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు కోర్టుకు హాజరయ్యారు. ప్రధాన నేతలు పలువురు కోర్టుకు రానుండటంతో, ఈ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.

More Telugu News