: బిగ్ బజార్లలో మినీ-ఏటీఎంల ఏర్పాటు.. రూ.2000 వరకు డబ్బు డ్రా చేసుకోవచ్చు!

బ్యాంకులు, ఏటీఎంల ద్వారా చిన్ననోట్లను డ్రా చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో ప్రజలకు ఊరట నిచ్చే ఒక ప్రకటనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసింది. ఈ నెల 24 నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న బిగ్ బజార్లలో ప్రజలు తమ డెబిట్ కార్డును ఉపయోగించి రూ.2000 వరకు డబ్బులు డ్రా చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఉన్న 260 బిగ్ బజార్లతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు, మినీ-ఏటీఎంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కస్టమర్లు షాపింగ్ చేసేందుకు వీలుగా ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. కాగా,‘ఫ్యూచర్ గ్రూప్’ సీఈవో కిషోర్ బయానీ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. గురువారం నుంచి బిగ్ బజార్ షాపింగ్ మాల్స్ లో ఒక్కొ వ్యక్తి తమ డెబిట్ కార్డు ద్వారా రూ.2000 చొప్పున విత్ డ్రా చేసుకోవచ్చన్నారు. ఇదిలా ఉండగా, ఎయిర్ పోర్టులో ఉచిత పార్కింగ్ ను ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించారు. ఐఆర్టీసీలో టికెట్ల బుకింగ్ సర్వీస్ ట్యాక్స్ ను డిసెంబర్ 31వరకు రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలో పెద్దనోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం లేదని ఆర్బీఐ ప్రకటించింది.

More Telugu News