: దక్షిణాఫ్రికా క్రికెటర్‌ డుప్లెసిస్‌కు మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత

బాల్ ట్యాంపరింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్ డుప్లెసిస్‌కు జ‌రినామా విధిస్తున్న‌ట్లు ఈ రోజు ఐసీసీ ప్రకటించింది. ఇటీవ‌ల‌ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో నిబంధనలు ఉల్లంఘిస్తూ స‌ద‌రు క్రికెట‌ర్ ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడ‌ని ఐసీసీకి ఫిర్యాదులంద‌డంతో స్పందించి ఈ నిర్ణ‌యం తీసుకుంది. డుప్లెసిస్ కి త‌న‌ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధిస్తున్న‌ట్లు ఐసీసీ పేర్కొంది. అయితే, ఎల్లుండి నుంచి ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ఆడ‌నున్న మూడో టెస్టు మ్యాచ్ లో మాత్రం డుప్లెసిస్ ఆడ‌వ‌చ్చ‌ని ఐసీసీ తెలిపింది.

More Telugu News