: సిండికేట్ బ్యాంక్ మెహిదీపట్నం బ్రాంచ్ వద్ద ఆందోళన

హైదరాబాద్ లోని మెహిదీపట్నం సిండికేట్ బ్యాంక్ బ్రాంచ్ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. తమ ఖాతాల్లోని డబ్బులు తీసుకునేందుకు ఈరోజు ఉదయం నుంచి ఖాతాదారులు క్యూ కట్టారు. అయితే, బ్యాంకులో నగదు నిల్వలు లేవని సిబ్బంది చెప్పడంతో ఖాతాదారులు మండిపడ్డారు.. వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు బ్రాంచ్ వద్దకు వెళ్లి ఖాతాదారులకు నచ్చజెప్పడంతో పరిస్థితి చక్కబడింది.

More Telugu News