: వివాహాలకు క్యాష్ విత్ డ్రా చేసుకోవాలంటే ఆర్బీఐ మార్గదర్శకాలు ఇవీ!

పెద్దనోట్ల రద్దు కారణంగా చిన్ననోట్లు సరిపడా అందకపోతుండటంతో వాయిదా పడుతున్న పెళ్లిళ్లు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివాహం చేసుకునే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. డిసెంబర్ 30లోపు వివాహాలు చేసుకునే వారికే ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. నిబంధనల విషయానికి వస్తే.. పెళ్లిళ్లు చేసుకునేవారికి రూ.2.5 లక్షల వరకు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఆ డబ్బును పెళ్లి ఖర్చులకే వాడుతున్నామని అఫిడవిట్ ఇవ్వాలని, వధువు/వరుడు లేదా వారి తల్లిదండ్రులు మాత్రమే క్యాష్ విత్ డ్రా చేయాలని, కేటరింగ్, మండపాల ఖర్చుకు ఆధారాలు చూపించాలనే నిబంధనలను ఆర్బీఐ విధించింది.

More Telugu News