: కరెన్సీని చిత్తుకాగితంతో పోల్చిన మోదీకి ప్రజాకోర్టులో ఉరిశిక్ష తప్పదు: సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు

‘ఐ ప్రామిస్ టు పే ది బేరర్...’ అంటూ హామీ ఉన్న కరెన్సీని చిత్తుకాగితంతో పోల్చిన ప్రధాని నరేంద్ర మోదీని నడివీధిలో ఉరి వేసినా పాపం లేదు అంటూ సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ కోర్టు కు వెళ్లినా కూడా ఆయనకు శిక్ష వేయాల్సిందేనని, ప్రజాకోర్టు కనుక వస్తే మోదీకి ఉరిశిక్ష తప్పదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ పవిత్రమైంది, ఈ కరెన్సీలో ఉన్నటువంటి హామీకి వ్యతిరేకంగా, దీనిని చిత్తు కాగితమని మోదీ చెప్పిన తర్వాత కూడా ఆయన్ని ప్రధానిగా గుర్తించడం వీలు కాదని నారాయణ విమర్శించారు.

More Telugu News