: పంజాబ్ మాజీ సీఎం స్విస్ బ్యాంకు ఖాతాలను బయటపెట్టిన కేజ్రీవాల్

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కు చెందిన స్విస్ బ్యాంకు ఖాతాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బట్టబయలు చేశారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భటిండాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కనీసం సొంత ఇంటికి పెయింట్ కూడా వేసుకోలేని ఆయన 2002లో ముఖ్యమంత్రి అయ్యాక భారీగా నిధులు కూడబెట్టారని అన్నారు. 2005లో ఆయన కుటుంబ సభ్యులు, ట్రస్ట్ పేరుతో స్విస్ బ్యాంకులో ఖాతా తెరిచారని పేర్కొంటూ, ఆ ఖాతాల వివరాలను ఆయన బయటపెట్టారు. పంజాబ్ సీఎం బాదల్ ప్రభుత్వంపైనా కేజ్రీవాల్ మండిపడ్డారు.

More Telugu News