: హైదరాబాద్లో బ్యాంకు ముందు ఖాతాదారుల ఆందోళన.. బ్యాంకును మూసేసిన మేనేజర్
దేశ వ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని బోరబండ శాఖ సిండికేట్ బ్యాంకు ముందు ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాలుగు రోజులుగా డబ్బు ఇవ్వడం లేదని బ్యాంకు ఎదుట ఈ రోజు ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. తమ కష్టాలు పట్టించుకోవడం లేదంటూ బ్యాంకుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు డబ్బు ఇవ్వవలసిందేనని పట్టుబట్టారు. దీంతో సదరు బ్యాంకు మేనేజర్ బ్యాంకును మూసేశారు. దీంతో ఖాతాదారులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.