: హైద‌రాబాద్‌లో బ్యాంకు ముందు ఖాతాదారుల ఆందోళ‌న‌.. బ్యాంకును మూసేసిన మేనేజర్

దేశ వ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్ర‌జ‌ల ఇబ్బందులు కొన‌సాగుతున్నాయి. హైద‌రాబాద్‌లోని బోర‌బండ శాఖ‌ సిండికేట్ బ్యాంకు ముందు ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావర‌ణం నెల‌కొంది. నాలుగు రోజులుగా డ‌బ్బు ఇవ్వ‌డం లేద‌ని బ్యాంకు ఎదుట ఈ రోజు ఖాతాదారులు ఆందోళ‌న చేప‌ట్టారు. త‌మ క‌ష్టాలు ప‌ట్టించుకోవ‌డం లేదంటూ బ్యాంకుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. త‌మకు డబ్బు ఇవ్వ‌వ‌ల‌సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు. దీంతో స‌ద‌రు బ్యాంకు మేనేజర్ బ్యాంకును మూసేశారు. దీంతో ఖాతాదారులు మ‌రింత ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

More Telugu News