: హైదరాబాద్ పై 'చలి' పులి పంజా... ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం

భాగ్యనగరిపై చలి పులి పంజా విసిరింది. నిన్న రాత్రి నగర కనిష్ఠ ఉష్ణోగ్రత 12.9 డిగ్రీలుగా నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 30.2 డిగ్రీలుగా నమోదయిందని చెప్పారు. సాధారణంగా ప్రస్తుత కాలంలో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలుగా ఉండాలని... అయితే సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతోందని వెల్లడించారు. అదే విధంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 4 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. రానున్న వారం రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని... శీతల గాలులు వీస్తాయని ప్రజలను హెచ్చరించారు.

More Telugu News