: రైలు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన రైల్వే మంత్రి

ఈ తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 63 మంది ప్రాణాలు కోల్పోయారని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో బాధితులకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబానికి రూ. 3.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేల పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు. మరోవైపు, గ్యాస్ కట్టర్లతో బోగీలను కట్ చేసి లోపల ఇరుక్కున్న వారిని వెలుపలికి తెస్తున్నారు. పట్టాలకు అడ్డంగా పడున్న బోగీలను క్రేన్ లు, జేసీబీల సహాయంతో పక్కకు తొలగిస్తున్నారు.

More Telugu News