: పాట్నా-ఇండోర్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం... 63కి పెరిగిన మృతుల సంఖ్య

ఈ తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ వద్ద పాట్నా-ఇండోర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 63కు చేరుకుంది. దాదాపు 150 మంది తీవ్రంగా గాయపడి, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో రైలు ప్రమాదానికి గురవడంతో... ఏకంగా 14 బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కాయి. దుర్మరణం పాలైన వారిలో ఎక్కువ మంది రెండు బోగీల్లో ఉన్నవారే ఉన్నారు. బోగీల్లో ఇరుక్కున్న ప్రయాణికులను వెలుపలికి తీసుకురావడానికి... గ్యాస్ కట్టర్లతో బోగీలను కట్ చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాన్ని కనుక్కోవడానికి కొంత సమయం పడుతుందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

More Telugu News