: రద్దయిన నోట్లతో ట్రాఫిక్ చలానాలు కట్టుకోవచ్చు

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. రద్దయిన రూ. 500, రూ. 1000 నోట్లతో ట్రాఫిక్ చలానాలను ఈ నెల 24 వరకు చెల్లించవచ్చని తెలిపారు. మీసేవ, ఈసేవ, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసుల్లో పెండింగ్ చలానాలు చెల్లించవచ్చని ప్రకటించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డ వారికి విధించిన చలానాలు చాలా వరకు పెండింగ్ లోనే ఉన్నాయని... అలాంటి వారు తమ చలానాలను చెల్లించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

More Telugu News