: అసోంలో స్వల్ప భూకంపం.. బెంబేలెత్తిన ప్రజలు
ఈ రోజు ఉదయం అసోంలో స్వల్ప భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని కరీంగంజ్ పరిసర ప్రాంతాల్లో భూకంప లేఖినిపై 5.0 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా తలెత్తిన నష్టంపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఒక్కసారిగా ప్రకంపనలు చోటు చేసుకోవడంతో కరీంగంజ్ ప్రాంత ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.