: గద్దెనెక్కిన మరుక్షణం 30 లక్షల మందిని ఇంటికి పంపిస్తా.. బాంబు పేల్చిన ట్రంప్

ఎన్నికల సమయం నాటి దూకుడును ట్రంప్ ఇంకా కొనసాగిస్తున్నారు. తాను గద్దెనెక్కిన వెంటనే 30 లక్షల మందిని ఇంటికి పంపిస్తానంటూ బాంబు పేల్చారు. దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 30 లక్షల మంది విదేశీయులను గద్దెనెక్కిన మరుక్షణమే ఇంటికి పంపిస్తానని ప్రకటించి గుబులు రేపారు. దేశంలో నేరగాళ్లు, నేరచరిత్ర ఉన్నవాళ్లు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్ డీలర్లు దాదాపు 30 లక్షల మంది వరకు ఉన్నారని, వారిని స్వదేశాలకు పంపడమో, నిర్బంధించడమో చేస్తామని తెలిపారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. మెక్సికో నుంచి అమెరికాలోకి క్రిమినల్స్, డ్రగ్స్‌ను అరికట్టేందుకు సరిహద్దులో గోడ కట్టి తీరుతామని మరోమారు స్పష్టం చేశారు. అయితే ట్రంప్ నిర్ణయంతో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ రియాన్ విభేదించారు. చట్ట విరుద్ధంగా దేశంలో నివసిస్తున్న వారిని స్వదేశాలకు పంపేందుకు కాంగ్రెస్ సభ్యులు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. ట్రంప్ ఆ దిశగా ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయడం లేదని తెలిపారు.

More Telugu News