: 6 వికెట్లు కోల్పోయిన భారత్... హిట్ వికెట్ గా వెనుదిరిగిన కోహ్లీ

రాజ్ కోట్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. నాలుగో రోజున 4 వికెట్ల నష్టానికి 319 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఈ రోజు మరో రెండు వికెట్లు కోల్పోయింది. 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. అనంతరం 13 పరుగులు చేసిన రహానే అన్సారీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అన్సారీ, రషీద్ లు చెరో రెండు వికెట్లు తీయగా, బ్రాడ్, స్టోక్స్ లు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం భారత స్కోరు 6 వికెట్ల నష్టానికి 376 పరుగులు. ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ (18), సాహా (8) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కన్నా భారత్ ఇంకా 161 పరుగులు వెనుకబడి ఉంది.

More Telugu News