: పవన్ చెప్పిన అంశాలను సూచనగా స్వీకరిస్తాం.. టీడీపీ సభ్యత్వ నమోదులో అగ్రస్థానంలో గుంటూరు: చినరాజప్ప

జనసేన పార్టీ అధినేత పవన కల్యాణ్ చెప్పిన అంశాలను సూచనగా స్వీకరిస్తామని ఏపీ మంత్రి చినరాజప్ప అన్నారు. రాష్ట్రాభివృద్ధిని సవాలుగా తీసుకుని సీఎం పని చేస్తున్నారని, మంచి పాలన అందించాలన్నదే ప్రభుత్వ ఏకైక ధ్యేయమని అన్నారు. పదిరోజుల్లో 9 లక్షల మందికి పైగా టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకున్నారని, టీడీపీ సభ్యత్వ నమోదులో గుంటూరు జిల్లా అగ్రస్థానంలో ఉందని, చిత్తూరు జిల్లా రెండో స్థానంలోను, కృష్ణా జిల్లా మూడో స్థానంలోను ఉండగా ఉభయగోదావరి జిల్లాలు వరుసగా 4,5 స్థానాల్లో నిలిచాయన్నారు.

More Telugu News