: పాత రూ.500, రూ.1000 నోట్లు చెల్లుతాయి: టీఎస్ ఆర్టీసీ ఎండీ

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించే గ్రూప్-2 పరీక్ష రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు సంస్థ ఎండీ రమణారావు పేర్కొన్నారు. గ్రూప్-2 పరీక్ష నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 2500 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ లో 1000, జిల్లాల్లో 1500 బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్టీసీ సర్వీసుల్లో పాత రూ.500, రూ.1000 నోట్లు చెల్లుతాయని ఈ సందర్భంగా రమణారావు పేర్కొన్నారు.

More Telugu News