: రాజ్కోట్ టెస్టు: దూకుడు మీదున్న ఇంగ్లండ్!
ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ భారత్ పర్యటనలో భాగంగా గుజరాత్లోని రాజ్కోట్లో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ రాణిస్తున్నారు. ఇంగ్లండ్ 76 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన డకెట్ 13 పరుగులకి అవుటయ్యాడు. అయితే ఆ తరువాత భారత బౌలర్లు విసురుతున్న బంతులను ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మెన్ జోయ్ రూట్ ధాటిగా ఎదుర్కొని శతకం సాధించాడు. మరో బ్యాట్స్మెన్ మొయిన్ ఆలీ కూడా చక్కగా రాణించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పరుగులు తీసింది. 124 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉమేష్ బౌలింగ్లో జేఈ రూట్ అవుటయ్యాడు. ప్రస్తుతం 84 ఓవర్లకి నాలుగు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 283 పరుగులతో ఆడుతోంది. క్రీజులో స్టోక్స్(1), అలీ (89) ఉన్నారు.