: ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు మన ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ చేశారు. అమెరికా 45వ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో భారత్ పై స్నేహపూర్వకమైన భావనను ఆయన వ్యక్తపరచడాన్ని మోదీ కొనియాడారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థానాలకు చేరతాయని ఆశిస్తున్నానని మోదీ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

More Telugu News