: బీజేపీ పరివర్తన్ యాత్రలో అశ్లీల నృత్యాలు

బీజేపీ పరివర్తన్ యాత్రలో అశ్లీల నృత్యాలు నిర్వహించిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పత్ లో జరిగింది. ఈరోజు నిర్వహించిన పరివర్తన యాత్రకు కేంద్రమంత్రి సంజీవ్ బలయాన్, ఎంపీ సత్యపాల్ సింగ్ హాజరు కావాల్సి ఉంది. దీంతో పాటు సీనియర్ నేతలు రావడం కొంత ఆలస్యమైంది. దీంతో, ఈ యాత్రకు హాజరైన వారిని అలరించేందుకు బార్ డాన్సర్లను రంగంలోకి దించడంతో, స్టేజ్ పై వారు అశ్లీల నృత్యాలు చేశారు. అయితే, ఈ సంఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

More Telugu News