: కాంగోలో గాయపడ్డ 32 మంది భారత సైనికులు

ఆఫ్రికా దేశం కాంగోలో జరిగిన భారీ పేలుడులో 32 మంది భారత సైనికులు గాయపడ్డారు. ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది ఈ ఘటనలో ఒక చిన్నారి మృత్యువాత పడ్డాడు. కాంగోలోని గోమా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 1996 నుంచి 2003 వరకు కాంగోలో జరిగిన ప్రాంతీయ ఆందోళనల్లో భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో, ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1800 మంది సైనికుల దళం అక్కడ శాంతి పరిరక్షణ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు గాయపడ్డ భారత సైనికులు కూడా ఆ దళంలోని వారే.

More Telugu News