: హాట్ హాట్ ఫోటోలతో.. సోషల్ మీడియా సెన్సేషన్గా బాలీవుడ్ హీరో జాకీ ష్రాఫ్ కుమార్తె

అందాల‌ను ఒల‌క‌బోస్తూ బాలీవుడ్ హీరో జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణా ష్రాఫ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోన్న తన ఫొటోలకి అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. బికినీలతో అదిరే లుక్స్ తో ఇన్స్టాగ్రామ్లో ఆమె పోస్ట్ చేస్తోన్న ఫొటోలకు తన ఫాలోవర్లు ఫిదా అయిపోతున్నారు. కొన్ని రోజుల క్రితం టాప్లెస్ ఫొటో, తాజాగా బికినీలో ఫొటోలను ఈ భామ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఉంచింది. 'టూ పీస్ బికినీతో ఫొటోలోని అమ్మాయి రాత్రి స‌మ‌యంలో స్విమ్మింగ్ పూల్లో సేద‌తీరుతున్న‌ట్లు ఉంది క‌దా?' అంటూ, 'మెదడుకు, శరీరానికి విశ్రాంతి ఇవ్వాలంటూ' ఆ అమ్మ‌డు సోష‌ల్‌మీడియాలో త‌న ఫొటోను గురించి పేర్కొంది. ఆమెకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఇప్పుడు లక్షా 85 వేలమంది ఫాలోవర్లు ఉన్నారు. కృష్ణా ష్రాఫ్ సోదరుడు టైగర్ ష్రాఫ్ బాలీవుడ్లోకి ఇప్పటికే ప్ర‌వేశించాడు. ఆయ‌నలాగే ఇప్పుడు ఈమె కూడా సినీరంగంలోకి ప్ర‌వేశించాల‌ని అనుకుంటోంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఫొటోల‌పై స్పందించిన ఆమె తండ్రి జాకీ ష్రాఫ్... తాను ఈ అంశంలో జోక్యం చేసుకోనని వ్యాఖ్యానించారు. తన కొడుకు, కూతురు టైగర్, కృష్ణా ఇద్దరూ తెలివైనవారని చెప్పిన ఆయ‌న, వారు ఏం చేయాలో వారికి తెలిసిపోయింద‌ని అన్నారు. ఈ విష‌యంలో తనకు అభ్యంతరం లేదని చెప్పాడు.

More Telugu News